తెలంగాణలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ సెక్రటేరియేట్లో నిర్వహించిన సమీక్షలో రేవంత్ మాట్లాడుతూ. “జూన్ వరకు బోర్లు, బావులు, ఇతర స్థానిక నీటి వనరులు వాడుకోవాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వాటర్ ట్యాంకులు సిద్ధంగా ఉంచాలి. ట్యాంకర్లు బుక్ చేస్తే 12 గంటల్లోపు చేరేలా చూడాలి" అని సీఎం ఆదేశించారు.