పశ్చిమ బెంగాల్లోని రేషన్ పంపిణీ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నార్త్ 24 పరగణాస్లోని బసిర్హత్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ నేత షేక్ షాజహాన్ను ఈడీ తాజాగా అరెస్టు చేసింది. వాస్తవానికి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులను దర్యాప్తు సంస్థలు విచారించడానికి వీలుండదు. అయితే ఇవాళ ఉదయం బసిర్హత్ సబ్-డివిజనల్ కోర్టును ఆశ్రయించిన ఈడీ అనుమతి లభించడంతో షేక్ షాజహాన్ను అదుపులోకి తీసుకుంది.