నల్లకుంట డివిజన్ పరిధిలోని గాంధీ నగర్లో కొనసాగుతున్న వాటర్ లైన్ పనులను బీజేపీ డివిజన్ కార్పొరేటర్ అమృత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే స్థానికంగా మంచినీటి సరఫరా సమస్యలు ఉండవని అన్నారు. పనులు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రాంత ప్రజలు సహకరించాలని కోరారు.