కొల్లాపూర్ తాలూకా స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించాలని, గత మూడు నెల క్రితం, స్థానిక కళాకారులను కొల్లాపూర్ శాసనసభ్యులు భిరం హర్షవర్ధన్ రెడ్డి ఆదుకోవాలని, మహా ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంలోనే స్థానిక కళాకారులు అందరం కలిసి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరంహర్షవర్ధన్ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందాని మీసాల రామన్న మాదిగ తెలిపారు. తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో మీసాల రామన్న మాదిగ మాట్లాడుతూ..దళిత కళాకారులకు, దళిత బంధు ఇస్తామాని, బిసి కళాకారులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని, కళాకారులకు కళాభవన్ నిర్మిస్తానని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పారని మీసాల రామన్న మాదిగ తెలిపారు.
మూడు నెలలు గడుస్తున్న కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్ని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి దానికి నిరసనగా, ఈనెల 28. 29. 30. 01. 02 తేదీ వరకు అంబేద్కర్ విగ్రహం ముందు నిలే నిరాహార దీక్షలు చేపట్టామని తెలిపారు.దీక్షలో కూర్చున్నవారు తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలుమూరి రాములు మాదిగ, రాష్ట్ర కార్యదర్శి మంతటి గోపి మాదిగ, రాష్ట్ర నాయకులు నాగరాజు, తెలంగాణ జానపద కళాకారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు కాటేపాగా నరసింహ, తాలూకా అధ్యక్షుడు పొతుగంటి రామకృష్ణ, ఉపాధ్యక్షులు వడ్డేమాన్ నరసింహ, సింగర్ జ్యోతి, దీక్షలో కూర్చున్నారు. హైదరాబాద్ దీక్షలోపు వీరమాచవర్ధన్ రెడ్డి గారు తన వైఖరిని తేల్చకపోతే, అంబేద్కర్ విగ్రహం ముందు తదుపరి కార్యాచరణ తీసుకుంటామని తెలంగాణ దండోరా, దండోరా జానపద కళాకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రాము మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జానపద కళాకారుల సంక్షేమ సంఘం తాలూకా కార్యదర్శిలు, డప్పు మధు, పర్వతాలు, యాదగిరి, సలేశ్వరం, నాగరాజు, శంకర్, స్వాతి, శ్రావణి, ఉమా. , సరిత, తదితరులు పాల్గొన్నారు.