పసికందు కిడ్నాప్

82చూసినవారు
పసికందు కిడ్నాప్
నల్గొండ జిల్లా గుండాల మండలం మోత్కూర్ గ్రామానికి చెందిన షాహినా నొప్పులు రావడంతో
గాంధీ ఆసుపత్రి ఈనెల 24 న మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అడ్మిట్ అయింది. ఆరోజే మగ బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఉదయం కొన్ని పరీక్షల నిమిత్తం బిడ్డను బెడ్ మీదనే వదిలి వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేసరికి బాబు కనిపించకపోవడంతో ఆసుపత్రి వారి సాయంతో అవుట్ పోస్ట్ లో ఫిర్యాదు చేసింది. సిసి కెమెరా ఫుటేజీ ఆధారంగా ఒక మహిళ ఎత్తుకెల్లినదని గుర్తించి ఆమెను నాచారంలో పట్టుకుని బిడ్డను తల్లికి అప్పగించారు.

ట్యాగ్స్ :