ఉన్మాదుల ట్రైనింగ్కు హైదరాబాద్ అడ్డాగా మారింది: ఎంపీ ఈటల

69చూసినవారు
ఉన్మాదుల ట్రైనింగ్కు హైదరాబాద్ అడ్డాగా మారిందని, సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ గుడి ఘటనే దీనికి నిదర్శనమని గురువారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఘటనపై సంపూర్ణ విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హైదరాబాద్ కాస్మో ప్రాంత నగరమని, గతంలో రక్తాన్ని చిందించిన నగరం కాబట్టి ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఎంపీగా కేంద్రానికి నివేదిక ఇస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్