రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు కేకే కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. గతంలో వీర్లపల్లి శంకర్ అనుచరుడిగా ఉన్న కేకే కృష్ణ గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మండలంలో ఒక బలమైన నాయకుడిగా కేకే కృష్ణకు పేరు ఉంది.