దేవతమూర్తుల విగ్రహాలను విరగ్గొట్టిన దుండగులు

73చూసినవారు
దేవతమూర్తుల విగ్రహాలను విరగ్గొట్టిన దుండగులు
షాద్ నగర్ నియోజకవర్గం ఫరూర్ నగర్ మండలం రాసుమల్లగూడ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు శ్రీరాములవారి ఊరేగింపు విగ్రహాలను విరగ్గొట్టి విలువైన కంచు గంటను ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం వెలుగు చూసింది. దుండగులను కఠినంగా శిక్షించాలని స్థానికులు అన్నారు. దైవం పై దాడులు చేస్తే ఆ పాపం ఊరికే పోదని, రోజు పూజలు చేసే భగవంతుని విగ్రహం ఇలా విరగ్గొట్టడం దారుణమని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్