సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉండే మోహన్ బాబు(25)మద్యం మత్తులో శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి ఇంట్లో నుండి భార్య వెళ్లిపోయిందని గందరగోళం చేశాడు. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మోహన్ బాబు స్తంభం మీదే కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ అందరినీ ఆందోళనకు గురిచేశాడు. గంటన్నర పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరకు పోలీసులే స్తంభం ఎక్కి సముదాయించి కిందకు దించారు.