యాకుత్ పురా: పోలీసులం మేమున్నాం అంటూ
ప్రజలలో భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు సైదాబాద్ ఏసీపీ వెంకన్న నాయక్ తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ సౌత్ ఈస్ట్ డీసీపీ ఆదేశాల మేరకు సైదాబాద్ మాదన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిల్లో ర్యాపిడ్ యాక్షన్ బలగాలు స్థానిక పోలీసులు కలిసి మార్చ్ చేపట్టారు. ముందుగా సైదాబాద్ పీఎస్ నుంచి ప్రారంభమైన మార్చ్ సపోటా బాగ్, జీవన్ యార్ జంగ్ కాలనీ, పూసల బస్తి, రెడ్డి బస్తి, మీదిగా మాదన్నపేట్ పీఎస్ వద్ద ముగించారు.