భారత్పై అసూయతో ఓ పాక్ జర్నలిస్టు చేసిన పోస్ట్ తన టైమ్లైన్లో కన్పించడంతో టీమిండియా బౌలర్ అశ్విన్ అసహనం వ్యక్తం చేశాడు. వెంటనే ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్కు రిక్వెస్ట్ పెట్టాడు.. ‘‘ఏం చేయాలో నేను మీకు (మస్క్) చెప్పలేను. కానీ మా ఇంట్లోకి ఎవరు ప్రవేశించాలన్నది నిర్ణయించుకునే హక్కు నాకు కచ్చితంగా ఉండాలి. నా టైమ్లైన్. నా నిర్ణయం’’ అని అశ్విన్ రాసుకొచ్చాడు.