ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే పనిలో పడ్డాయి ఐటీ కంపెనీలు. ఈ విషయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముందు వరుసలో ఉండగా.. మిగిలిన కంపెనీలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ విషయమై తాజాగా హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది. డిజిటల్ ఫౌండేషన్ సర్వీసెస్ కింద పనిచేస్తున్న ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది.