ఆసీస్పై ఇవాళ రాత్రి జరిగే మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే సెమీస్కు దూసుకుపోతుంది. మరోవైపు అగ్రస్థానంతో సూపర్-8ను ముగిస్తుంది. సెమీస్లో ఇంగ్లాండ్తో తలపడాల్సి ఉంటుంది. గ్రూప్-2లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్కు చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్ చేతిలో ఆసీస్ ఓడితే నాకౌట్ అవకాశం దెబ్బతింటుంది. బంగ్లాదేశ్పై అఫ్గాన్ విజయం సాధిస్తే మాత్రం కంగారూల జట్టు ఇంటిముఖం పట్టక తప్పదు.