ప్రధాని మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని కూల్చేస్తారని మోదీ ప్రచారం చేయడం దారుణమన్నారు. మోదీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించిందే రాజీవ్గాంధీ ప్రభుత్వామని గుర్తు చేశారు. ఆయన బతికుంటే రామాలయ నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. మత సామరస్యానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.