శనివారం సాయంత్రం విడుదలైన దాదాపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే మెజార్టీని ఇచ్చాయి. దాదాపు 350కి పైగా సీట్లు గెలుస్తుందని ప్రకటించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆప్ నేత సోమ్నాథ్ భారతి కీలక ప్రకటన చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫాల్స్ అని కొట్టిపడేశారు. ఓట్ల లెక్కింపు రోజున ఈ ఫలితాలన్నీ తప్పు అనే తేలుతాయన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని సవాల్ విసిరారు.