శరీరానికి తగినంత మెగ్నీషియం లేకపోతే ఇబ్బందులు వస్తాయి. గుండెపోటు, స్ట్రోక్, డయాబెటిస్ లేదా బోలు ఎముకల వ్యాధి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. మెగ్నీషియం సరైన స్థాయిలో శరీరంలో ఉండాలి. ఆ లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యుడిని సంప్రదిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. మెగ్నీషియం లోపం వలన కండరాల నొప్పి, విపరీతమైన అలసట, ఆకలి లేకపోవడం, ఎముకల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.