పసుపు పాలు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ఇవి కాలేయాన్ని రక్షిస్తాయి. కాలేయంలో చేరే విషకారకాలను హరిస్తుంది. ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తుంది. పసుపు పాలను క్రమం తప్పకుండా తాగితే కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి లింఫోటిక్ సిస్టమ్ను కూడా శుద్ధిచేస్తాయి.