చిన్నారుల ప్రాణం తీసిన నిమజ్జనం సరదా

82చూసినవారు
చిన్నారుల ప్రాణం తీసిన నిమజ్జనం సరదా
స్కూళ్లకు సెలవులు కావడంతో సరదాగా మట్టి గణపతిని తయారు చేసి నిమజ్జనం చేసేందుకు చెరువుకు వెళ్లిన ముగ్గురు బాలురు నీట మునిగి మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి(D) మూడుచింతలపల్లి(M)లో జరిగింది. మనోజ్‌(9), మణికంఠ(13), హర్షవర్ధన్‌యాదవ్‌(11) శుక్రవారం మట్టితో వినాయకుడిని తయారు చేసి పూజలు చేశారు. నిమజ్జనం చేసేందుకు స్థానిక పెద్ద చెరువుకు వెళ్లి నీటిలోకి దిగి గల్లంతయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు.

సంబంధిత పోస్ట్