ఆరు జోన్లలో నిమజ్జనం

68చూసినవారు
ఆరు జోన్లలో నిమజ్జనం
హైదరాబాద్‌ మహానగరంలో సుమారు లక్ష విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌ బండ్‌వైపు మినహా ఎన్టీఆర్ మార్గ్‌, పీవీ మార్గ్‌లో క్రేన్లను సిద్ధం చేశారు. మొత్తం ఆరు జోన్లలో 5 పెద్ద చెరువులతోపాటు తాత్కాలికంగా 73 కుంటలను నిమజ్జనానికి సిద్ధం చేశారు. ఎల్బీనగర్ పరిధిలో 12, ఛార్మినార్ జోన్‌లో 10, ఖైరతాబాద్ జోన్‌లో 13, శేరిలింగంపల్లి జోన్‌లో 13, కూకట్‌పల్లి జోన్‌లో 11, సికింద్రాబాద్ జోన్‌లో 12 తాత్కాలిక నిమజ్జన కుంటలను సిద్ధం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్