అమెరికాలో ఇటీవల కాల్పుల ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తొలి నాలుగు రోజుల్లోనే దేశవ్యాప్తంగా 400 మంది తూటాలకు బలైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ విషయంపై
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించడంతోపాటు, గతంలో అమలు చేసిన ఆయుధ నిషేధాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు.