టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదో టెస్టు అరుదైన ఘట్టం కానుంది. 5వ టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాల స్టేడియంలో జరగనుంది. భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్, ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ జానీ బెయిర్స్టో ఇద్దరికీ ఇది 100వ టెస్టు మ్యాచ్. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు వేర్వేరు జట్లకు చెందిన ఆటగాళ్లు ఒకే మ్యాచ్లో 100వ టెస్టు ఆడడం ఇది 3వ సారి మాత్రమే అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.