ఎన్నికల వేళ దేశమంతా నామినేషన్ల పర్వం నడుస్తోంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్లను వేసేందుకు వేర్వేరు పద్ధతుల్లో రిట్నరింగ్ ఆఫీస్కు వెళ్తున్నారు. అయితే మహారాష్ట్రలోని ఔరంగబాద్లో ఇండిపెండెంట్ అభ్యర్థి సాహెబ్ ఖాన్ పఠాన్ వినూత్న రీతిలో తన నామినేషన్ వేశారు. నామినేషన్ వేసేందుకు ఆయన ఒంటెపై వెళ్లారు. ఔరంగబాద్ నియోజకవర్గంలో మే 13న పోలింగ్ జరగనున్నది.