వర్షం కారణంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు శనివారం ఆట బంతి పడకుండానే రద్దైన సంగతి తెలిసిందే. మూడో రోజు ఆదివారం ఆట కూడా ఆలస్యమవుతోంది. మ్యాచ్కు పిచ్కు సిద్ధంగా ఉందా లేదా? అనే అంశంపై అంపైర్లు 10 గంటలకు పరిశీలించనున్నారు. బంగ్లాదేశ్ ప్రస్తుత స్కోరు 107/3. మొమినుల్ హక్(40*), ముష్ఫికర్ రహీమ్(6*) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్దీప్ 2, అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.