భారత మిక్స్డ్ రీలే బృందం చరిత్ర సృష్టించింది. బ్యాంకాక్లో జరిగిన ఆసియన్ రీలే ఛాంపియన్షిప్స్లో జాతీయ రికార్డు బద్దలు కొడుతూ పసిడి పతకం సాధించింది. మహమ్మద్ అజ్మల్, జ్యోతికా శ్రీ దండి, అమొల్ జాకబ్, సుబా వెంకటేశన్లతో కూడిన బృందం ఇవాళ జరిగిన ఫైనల్లో 4×400 మీటర్ల పరుగును 3:14.12 నిమిషాల్లోనే పూర్తి చేసి విజేతగా నిలిచింది. నిరుడు ఆసియా గేమ్స్లో 3:14.34 నిమిషాలతో నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసింది.