టీమిండియా మరోసారి చరిత్ర సృష్టించింది. స్వదేశంలో వరుసగా 17 టెస్ట్ సిరీస్లు గెలిచిన జట్టుగా నిలిచింది. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే 3-1తో కైవసం చేసుకున్న భారత్ ఈ అరుదైన ఫీట్ను అందుకుంది. ఈ ఫీట్ 2013 నుంచి 2024 మధ్య సాధించింది. భారత్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(10), ఆ తర్వాత వెస్టిండీస్ (8), న్యూజిలాండ్ (8) ఉన్నాయి.