మాల్దీవుల నుంచి భారత సైన్యం నిష్క్రమించింది. దక్షిణ అటాల్లో నిఘా విమానం విధులు నిర్వర్తిస్తున్న 25 మంది భారత సైనికులు ఆ దేశాన్ని వీడినట్లు అక్కడి మీడియా ప్రకటించింది. కాగా దీనిపై భారత్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా మే 10 నాటికి భారత సైన్యం తమ దేశాన్ని వీడాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఆదేశించారు. దీంతో మొదటగా 25 మంది ఆ దేశాన్ని వీడినట్లు తెలుస్తోంది.