ఏపీ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్ జగన్ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సెటైర్లు వేశారు. అసెంబ్లీ విధానాన్ని తప్పుబడుతూ స్పీకర్కు జగన్ లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. స్పీకర్ని జగన్ డిమాండ్ చేస్తున్నట్లు లేఖలో ఉందని పేర్కొన్నారు.