పంజాబ్లో విశ్వహిందూ పరిషత్ (VHP) నేత వికాస్ ప్రభాకర్ హత్య కేసులో ఇద్దరు నిందితుల ఫొటోలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విడుదల చేసింది. వీరిని ప్రాణాలతో పట్టిస్తే రూ.10 లక్షల నగదు ఇస్తామని ప్రకటించింది. పంజాబ్లోని నవన్షహర్లోని గర్పాధన గ్రామానికి చెందిన హర్జిత్సింగ్ అలియాస్ లడ్డీ, హరియాణాలోని యమునా నగర్ వాసి కుల్బీర్ సింగ్ అలియాస్ సిద్ధూని నిందితులుగా గుర్తించారు.