అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు, విజయవాడలోని కీలక ప్రాంతాలను కలిసే తూర్పు బైపాస్ చేపట్టాలన్న చంద్రబాబు ప్రతిపాదపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. రూ.20 వేల కోట్లతో రాజధానికి ఇన్నర్ రింగ్ రోడ్కి కేంద్రం ఒప్పుకుంది. అలాగే విజయవాడ తూర్పు బైపాస్కి ఆమోదం వచ్చింది. రెండు రోజుల చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటన ఫలితంగా ఏపీలో ఈ ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు లభించాయి.