ఫేక్ సర్టిఫికెట్లతో అధికారిణిగా మారిన ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్కు కష్టాలు వెంటాడుతున్నాయి. పూజా ఖేద్కర్పై మోసం ఆరోపణలపై UPSAC ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పుడు ఢిల్లీ పోలీసులు పూజాకు సమన్లు పంపనున్నారు. ఈ వారం చివరిలోగా ఆమెకు నోటీసులు పంపనున్నట్లు సమాచారం. దీంతో ఆమెను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం వారు పూజా పత్రాలను పరిశీలించనున్నారు.