ఐపీఎల్-17వ సీజన్ ఫైనల్ చెన్నైలో జరుగనుంది. ఈ మేరకు బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి తొలి 21 మ్యాచులకు మాత్రమే షెడ్యూల్ విడుదలైంది. తాజాగా మిగిలిన షెడ్యూల్ను కూడా రూపొందించారని, మే 26న చెన్నైలో ఫైనల్ నిర్వహించాలని నిర్ణయించినట్లు బీసీసీఐ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఇక గుజరాత్ స్టేడియంలో క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచులను జరపనున్నారని తెలిపారు.