ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు వివాహాలు అయ్యాయి. తమ్ముడి భార్య అందంగా ఉండటంతో అన్న మనసు పారేసుకున్నాడు. మరదలిపై వ్యామోహంతో తమ్ముడిని ట్రాక్టరుతో తొక్కించి, ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడిని ధనపాల్గా గుర్తించారు. మృతుడి భార్య ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.