నీటిపారుదల శాఖలో నలుగురు అధికారులు ఏసీబీ కి పట్టుబడ్డారు. ఓ దస్త్రం ఆమోదానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాలయంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నిఖేశ్లను అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కీలక అధికారి ఒకరు తప్పించుకోవడంతో సుమారు 4 గంటలు శ్రమించి నాలుగో వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. నలుగురిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.