దేశంలోనే మొదటి మహిళా పిచ్ క్యూరేటర్గా జసింత కల్యాణ్ ఘనత సాధించింది. బెంగళూరులో జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో పిచ్ క్యూరేటర్గా జసింత తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. బెంగళూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరొబెలె అనే ఊరిలో జసింత జన్మించారు. తొలుత ‘కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్’లో రిసెప్షనిస్ట్గా, తర్వాత అడ్మినిస్ట్రేటర్గా ప్రమోట్ అయ్యారు. అలా ఇప్పుడు క్యూరేటర్గా ఎదిగారు.