పూరి జగన్నాధ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. జులై 7న పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవం జరగనుండగా ఈసారి ఒకే రోజున నవయవ్వన వేడుక, నేత్రోత్సవం, ఘోషయాత్ర నేత్రపర్వంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రథయాత్ర ఏర్పాట్లపై ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఇరువురు డిప్యూటీ సీఎంలు కేవీ సింగ్ డియో, ప్రవతి పరిదా రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్తో శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు.