తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జపాన్ రాయబారి సుజుకి హిరోషి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులపై సీఎం రేవంత్ కు సుజుకి కి మధ్య చర్చ జరిగింది. కాగా జపాన్ కు చెందిన ప్రముఖ వైద్య పరికాల కంపెనీ ఒలింపస్ కార్పొరేషన్ హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. HCL టెక్నాలజీస్ సంస్థతో కుదిరిన భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఒలింపస్ ఈ నిర్ణయం తీసుకుంది.