ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో దారుణం జరిగింది. ఏనుగుతో రీల్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గురువారం అడవి నుంచి బయటపడిన ఒక ఏనుగు ఆ జిల్లాలోని హబీబావాలా గ్రామానికి చేరింది. ఈ క్రమంలో ముర్సాలీన్(30) అనే వ్యక్తి ఆ ఏనుగుతో రీల్ చేసేందుకు ప్రయత్నించాడు. భయపెట్టి తరిమేందుకు దాని సమీపానికి వెళ్లాడు. ఆగ్రహించిన ఏనుగు అతడి వెంటపడి కాళ్లతో తొక్కి చంపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.