’ఏ తప్పూ చేయకపోయినా, మా కుటుంబం 42 రోజులపాటు జైల్లో మగ్గింది. ఇందుకు కారకులైన ఐపీఎస్లతో పాటు, విద్యాసాగర్పై కేసు పెట్టి, చర్యలు తీసుకోండి’ అని జత్వానీ ఫిర్యాదులో కోరారు. దీనిపై సీఐ చంద్రశేఖర్ స్పందిస్తూ జత్వానీ ఫిర్యాదుపై న్యాయసలహా తీసుకుని, కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఆమె తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర విలేకర్లతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం తాము ఎస్హెచ్వోకు ఫిర్యాదు చేశామని, తమకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై నమ్మకం ఉందని అన్నారు.