చందూర్ లో పోడు రైతుల సంతకాల సేకరణ

61చూసినవారు
చందూర్ లో పోడు రైతుల సంతకాల సేకరణ
పోడు భూమిని సాగు చేసుకొని జీవిస్తున్న గిరిజనేతర నిరుపేద పోడు రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని కోరుతూ, పోడు భూముల సాధన కమిటీ నాయకులు చందూర్ బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా పోడు భూముల సాధన కమిటీ కన్వీనర్ నన్నేసాబ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరుపేద పోడు రైతులకు పట్టాలి ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్