గుంతలమయంగా నిజాంసాగర్ ప్రాజెక్టు రహదారి

51చూసినవారు
నిజాంసాగర్ మండల కేంద్రం నుంచి ఎంఈఓ కార్యాలయం పక్కన నుంచి 12 గేట్ల వరకు వెళ్లే రహదారి గుంతలమయంగా ఉండడంతో ప్రాజెక్టుకు వెళ్లాలంటే పర్యాటకులు భయపడుతున్నారు. నిజాంసాగర్ మండల కేంద్రం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు కిలోమీటర్ దగ్గరలోనే ఈ రహదారి గుండా ఎక్కువ సంఖ్యలో పర్యటకులు వెళుతుంటారు. ఈ రహదారికి మొరం వేసి కనీస మరమ్మత్తులతో చదును చేయాలని పర్యటకులు శుక్రవారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్