దుర్గామాత పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

64చూసినవారు
దుర్గామాత పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సతీ సమేతంగా మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గామాత దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా శుక్రవారం పూజలో పాల్గొన్నారు. దుర్గా దేవీ ఆశీస్సులతో జుక్కల్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్