మమ్మద్ నగర్ మండలంలోని సింగీతం, తెల్గాపూర్ గ్రామాలలో ఎంపీ అభ్యర్థి సురేష్ హెడ్కర్ కు మద్దతుగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సంక్షేమం పేద ప్రజలకు చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.