భవానిపేటలో ఓటు హక్కు పై అవగాహన

563చూసినవారు
ఐఎస్ఆర్డి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాల్వంచ మండలం భవానీపేట్ గ్రామంలో బుధవారం ఉపాధి హామీ కూలీలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి అమృత రాజేందర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం అన్నారు. గ్రామంలో 100% ఓటు హక్కు వినియోగించుకునేల ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఓటర్లే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు అని పేర్కొన్నారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేశారు. శివాజీరావు, హరీష్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్