కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల శ్రావణి ఐటిఐ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ఐటిసి, తోషిబా కంపెనీలలో ఉద్యోగాలకు భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు 99899 82929, 98669 09681 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.