వ్యవసాయంతో పాటు లాభదాయకమైన పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫార్మ్స్ తోటల పెంపకం వంటి వాటిపై రైతులు దృష్టి సారించి ఆర్ధిక వృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం కళాభారతి ఆడిటోరియంలో డెయిరీ టెక్నాలజీ కళాశాల హైదరాబాద్ కు చెందిన జాతీయ మాంస పరిశోధన సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను కలెక్టర్ ప్రారంభించారు. ట్రాక్టర్ల స్టాల్స్ ను పరిశీలించారు.