సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరగింది. జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. గాంధారి మండలం చిన్న పోతంగల్ కు చెందిన సంతోష్ పని నిమిత్తం కామారెడ్డి వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్ ను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందినట్లు ఎస్ఐ రాజు తెలిపారు.