లింగంపేట్ మండలంలోని శెట్ పల్లి గ్రామ యువత, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో యువకులు భారీగా రక్త దానం చేశారు. స్థానిక ఎస్సై ప్రభాకర్ మాట్లాడుతూ యువత రక్త దానం చేయడం గొప్ప విషయం అని అభినందించారు. రక్త దానం చేయడం ద్వారా ఒక మనిషి జీవితం కాపాడిన వారవుతారు అని రక్త దానం చేసి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు అని ప్రశంసించారు.