భారత్ - పాక్ మధ్య జరిగిన ప్రధాన సైనిక సంఘర్షణలలో ఈ కార్గిల్ యుద్ధం ఒకటి. దీని ఫలితంగా గణనీయమైన ప్రాణ నష్టం మరియు వనరుల నష్టం జరిగింది. ఇది భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగిన చివరి యుద్ధం. ఈ యుద్ధంలో భారత సాయుధ బలగాలకు చెందిన 527 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు, 1363 మంది గాయపడ్డారు. ఈ 527 మంది భారత సైనికుల ప్రాణత్యాగాల ఫలితంగా మనకు దక్కిన విజయమే 'కార్గిల్ విజయ్ దివస్'.