ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కరపత్ర రూపంలో గడపగడపకు వెళ్తూ ప్రజలకు వివరిస్తున్నారు. సోమవారం కమలాపూర్ మండల కేంద్రంలో తుమ్మ శోభన్ బాబు ఆధ్వర్యంలో ప్రతి బూతు కు వెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ మరొకసారి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బూతు అధ్యక్షులు మొగిలి, బాలరాజు, బిక్షపతి పాల్గొన్నారు.