పట్టుదల ఉంటే ఎదైనా సాధించవచ్చని యువకుడు నిరూపించాడు. సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామానికి చెందిన చిలుకం మహేష్ అనే యువకుడు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఇటీవల వెల్లడించిన గురుకుల పాఠశాల ఉపాద్యాయునిగా ఎంపికయ్యారు. గురువారం వెల్లడించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో గణిత శాస్త్ర విభాగంలోనూ ఎంపికయ్యాడు. మహేష్ కు పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలియజేశారు.